ఎర్రుపాలెం: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మండలంలోని నరసింహాపురం గ్రామానికి చెందిన కృష్ణకుమారికి ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.60 వేలు చెక్కును సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మధిర మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు,ఎంపీపీ దేవరకొండ శిరీష,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు,ఎర్రుపాలెం సొసైటీ చైర్మన్ ముల్పూరి శ్రీనివాసరావు, సర్పంచ్ మేరుగుమళ్ల లక్ష్మీ, కృపాకర్, బీ.నాగేశ్వరరావు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.