వైరా టౌన్, నవంబర్ 25: నియోజకవర్గ ప్రజలందరూ సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ఆయనను మళ్లీ గెలిపించుకుంటేనే మరిన్ని పథకాలు అందుతాయని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నూతన మ్యానిఫెస్టోను అమలుచేయడం ద్వారా మరింత ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు. వైరా పట్టణంలో శనివారం పర్యటించిన ఆయన.. బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్లాల్, వైరా ఎమ్మెల్యే రాములునాయక్లతో కలిసి బ్రాహ్మణపల్లి, బోడేపూడి కాలనీ, 7, 8 వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలందరూ సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. వారి దీవెనలతో కేసీఆర్ మరోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, వైరా నియోజకవర్గంలో గెలిచేది మదన్లాలేనని తేల్చిచెప్పారు.
ఎన్నికలప్పుడు వచ్చి దేశంలోనే తెలంగాణను నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్ మాట్లాడుతూ.. కేవలం ఎన్నిలప్పుడు వచ్చి కొందరు నేతలు చెప్పే మాయమాటలకు ప్రజలు నమ్మవద్దని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బోయినపల్లి కృష్ణమూర్తి, చిత్తారు సింహాద్రియాదవ్, పసుపులేటి మోహన్రావు, బాణాల వెంకటేశ్వర్లు, ముళ్లపాటి సీతారాములు, నంబూరి కనకదుర్గ, వేల్పుల పావని, కట్టా కృష్ణార్జున్రావు, మద్దెల రవి, లాల్మహ్మద్, వనమా విశ్వేశ్వరరావు, కాపా మురళీకృష్ణ, మాదినేని సునీత, దుర్గాప్రసాద్, కోటయ్య, కొత్తా వెంకటేశ్వరరావు, మోరంపూడి ప్రసాద్రావు, ఏదునూరి శ్రీను, మరికంటి శివ, చిలకా కోటయ్య, పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.