కల్లూరు, అక్టోబర్ 31: కల్లూరులో బుధవారం జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. కల్లూరులో షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక, బారికేడ్లు, హెలీప్యాడ్ తదితరాలను సిద్ధం చేశారు. సుమారు 50 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయడంతో సభకు వచ్చే ప్రజలు, నాయకులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. 80 వేల మంది కూర్చునేలా వసతులు కల్పించారు.
ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే వెంకటవీరయ్య, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు మంగళవారం పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు అజయ్బాబు, రఘు, రామారావు, పెడకంటి రామకృష్ణ, కాటంనేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.