మణుగూరు టౌన్, ఆగస్టు 11: సంక్షేమ పథకాల రూపశిల్పి సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాలు లబ్ధిపొందిన మహిళలతో రాఖీ కట్టించుకున్నారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా, దళితబంధు వంటి ఎన్నో పథకాలు లబ్ధిదారుల ఇంట వెలుగులు నింపుతున్నాయన్నారు. తర్వాత హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. సమావేశంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ముత్యం బాబు, అడపా అప్పారావు, నాయకులు బొలిశెట్టి నవీన్, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, చంద్రకళ, రమాదేవి, సుజాత పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరికలు..
సారపాక, ఆగస్టు 11: మణుగూరు పట్టనణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో రాష్ట్ర జన సమితి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి బిట్రా సాయిబాబాతో పాటు పలువురు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్తోనే అన్నివర్గాల సంక్షేమం సాధ్యమన్నారు. పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. కార్యక్రమంలో శ్రామికశక్తి అధ్యక్షుడు సానికొమ్ము శంకర్రెడ్డి, నెల్లిపాక ఎంపీటీసీ గాదె విజయ, నాయకులు పూర్ణ, సోము లక్ష్మీచైతన్యరెడ్డి, నాగేశ్వరరావు, రామిరెడ్డి, నర్సింహారావు పాల్గొన్నారు.
దళితులకు చేయూత
అశ్వాపురం, ఆగస్టు 11: దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనందిస్తుందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు.మల్లెలమడుగుకు చెందిన ఈసంపల్లి పున్నారావుకు దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన యూనిట్ (బొలెరో)ను గురువారం అందజేసి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.10 లక్షల విలువైన యూనిట్ అందిస్తున్నారన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ చేయూతతో ఎస్సీలు యజమానులుగా ఎదుగుతున్నారన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మణుగూరు టౌన్, ఆగస్టు 11: కూనవరానికి చెందిన పాయం ప్రమీల, కొండాయిగూడేని చెందిన గంధం నతానీకి విడుదలైన రూ.లక్ష విలువైన చెక్కులను గురువారం జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారి అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు, సర్పంచ్ ఎన్నిక ప్రసాద్, ఉప సర్పంచ్ ప్రభుదాస్ పాల్గొన్నారు.