ఖమ్మం, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాద్రిలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.కోటి మంజూరు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఈ నిధులు కేటాయించినట్లు చెప్పారు.
కరోనా సమయంలో భద్రాద్రి ఆలయానికి భక్తులు రాక ఆదాయం తగ్గిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు మంజూరు చేశారని తెలిపారు. రూ.కోటి ప్రత్యేక నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.