సత్తుపల్లి రూరల్, ఆగస్టు 24: దేశంలో తెలంగాణ తప్ప మరే రాష్ట్రంలో కూడా దివ్యాంగులకు రూ.4016 పింఛన్ ఇవ్వడం లేదని, అత్యధిక పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం పట్టణంలోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో దివ్యాంగులకు పెరిగిన పింఛను ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు అండగా నిలుస్తున్నారని, నియోజకవర్గ వ్యాప్తంగా 5062 మంది లబ్ధిదారులకు రూ. 4016 ఆసరా పింఛన్ అందిస్తున్నారన్నారు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో పింఛన్ రూ.900 మాత్రమే ఇస్తున్నారని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అతి తక్కు వ పింఛన్లు ఇస్తూ.. ఇక్కడ మాత్రం అధిక పింఛన్ ఇస్తామంటూ మాయమాటలు వల్లిస్తున్నారని దు య్యబట్టారు. పెరిగిన పింఛన్లతో ఏడాదికి రూ. 650కోట్ల అదనపు భారం పడుతున్నా.. వెనక్కు తగ్గకుండా సాయం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ రాకముందు రూ.500 ఉన్న పింఛన్ను సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక విడతల వారీగా పెంచుకుంటూ రూ.4016 చేశారని గుర్తు చేశారు.
ఎన్నికలప్పుడు మాయగాళ్లు వస్తుంటారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యమంత్రి, మంత్రు ల సహాయంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో సగర్వంగా ఓట్లు అడిగే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్కే ఉందన్నారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని రూ.1000 కోట్లతో అభివృద్ధి చేశామని, ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గానికి పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాల, జూనియర్ కళాశాల నూతన భవనాలు మంజూరయ్యాయని, ఎంపీ పార్థసారథిరెడ్డి సహాయ, సహకారాలతో అధునాతన గ్రంథాలయం నిర్మిస్తున్నామన్నారు. డీఆర్డీవో అడిషనల్ పీడీ జయశ్రీ, ఆర్డీవో అశోక చక్రవర్తి, ఎంపీడీవో జయరామ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, మెప్మా పీఆర్పీ గుడిపూడి సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఎంపీపీ దొడ్డా హైమావతి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఆత్మ చైర్మన్ వనమా వాసు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, నాయకులు మట్టా ప్రసాద్, పవన్, చాంద్పాషా, దామోదరరెడ్డి, కాలినేని వెంకటేశ్వరరావు, చింతల సురేందర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు.