మామిళ్లగూడెం, జనవరి 30: ఇటీవలి బదిలీల్లో భాగంగా నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించిన పలువురు సీఐలు ఖమ్మంలో సీపీ సునీల్దత్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందించారు. సీపీని కలిసిన వారిలో ఖమ్మం వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఖానాపురం హవేలీ, సత్తుపల్లి, సీసీఎస్ల సీఐలు ఉదయ్కుమార్, బాలకృష్ణ, రమేశ్, భానుప్రకాశ్, కిరణ్, సత్యనారాయణలు ఉన్నారు. ఈ సందర్భంగా వారికి సీపీ పలు సూచనలు చేశారు.