వేంసూరు, అక్టోబర్ 31 : కల్లూరులో జరిగే బహిరంగసభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల శంఖారావంలో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గెలుపు కోరుతూ బుధవారం కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న దృష్ట్యా మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో ఎంపీటీసీ గొర్ల శ్రీనివాసరావు, నున్నా రాంబాబు, లింగపాలెం ఉపసర్పంచ్ యర్రా రమేశ్, నాయకులు దొడ్డ వెంకటకృష్ణారెడ్డి, దొడ్డ చెన్నకేశవరెడ్డి, సింగపోగు ప్రసాద్ పాల్గొన్నారు.
తల్లాడ, అక్టోబర్ 31 : కల్లూరులో బుధవారం నిర్వహించే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, ఏఎంసీ వైస్చైర్మన్ దూపాటి భద్రరాజు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శీలం కోటారెడ్డి కోరారు. మంగళవారం తల్లాడలో వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గెలుపే లక్ష్యంగా కల్లూరులో జరిగే సీఎం కేసీఆర్ సభకు తల్లాడ మండలం నుంచి భారీగా ప్రజలు తరలిస్తున్నట్లు తెలిపారు.
పెనుబల్లి, అక్టోబర్ 31 : నవంబర్ 1న కల్లూరులో నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగసభను విజయవంతం చేయాలని జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు కోరారు. మంగళవారం పెనుబల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేసీఆర్ బహిరంగ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, నాయకులు లక్కినేని వినీల్, మందడపు అశోక్కుమార్ ఉన్నారు.
సత్తుపల్లి, అక్టోబర్ 31 : బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం కల్లూరులో జరగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభను విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్యఅతిధిగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతారని, సత్తుపల్లి పట్టణ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో కల్లూరు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు.