పెనుబల్లి: “వెల్డన్ మిస్టర్ అశోక్ అంటూ “పెనుబల్లి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మందడపు అశోక్కుమార్ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు. ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పొన్నవరానికి రాగా పెనుబల్లి మండలం అడవిమల్లెలకు చెందిన శ్రీ అభయాంజనేయ కోలాట భజన మండలి స్వాగతం పలికింది.
భజనమండలి ప్రదర్శించిన కోలాటానికి ప్రధాన న్యాయమూర్తి ఎంతో ఆకర్షితులై కోలాట బృందం ఎక్కడి వారంటూ ఆరా తీసి, తెలంగాణ, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అని తెలియడంతో సంప్రదాయాలకు తెలంగాణ నిలయమన్నారు. అలాగే అశోక్ పెనుబల్లి మండలం అడవిమల్లేల సర్పంచ్ అని, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అని తెలియడంతో అభినందించినట్లు అశోక్ తెలిపారు.