ఖమ్మం : రోజు, రోజుకూ ఖమ్మంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య బృందం డీఎంహెచ్ఓ డాక్టర్ బీ. మాలతితో కలిసి నగరంతో విస్తృతంగా పర్యటించారు. నగరంలో అధికంగా కేసులు నమోదవుతున్న బీకే బజార్, ఖానాపురం, రోటరీనగర్, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాల్లో బృందం సభ్యులు పర్యటించారు.ఈ సందర్భంగా పలు ప్రాంతాలను పరిశీలించారు.
డెంగీ దోమలు లార్వాలపై నిల్వ ఉండే స్థావరాలపై అవగాహన కల్పించి, డెంగీ జ్వరాల పై ఉన్న భయాందోళనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రబృందం సభ్యులు లక్ష్మణ్, కన్సల్టెంట్ శ్రీనివాస్, టెక్నికల్ ఆఫీసర్ డీఎస్ఓ డాక్టర్ రాజేశ్, ఏపిడమాలజిస్టు డాక్టర్ మాధవరావు, డీఎంఓ సంధ్య, ఏఎంఓ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.