రఘునాథపాలెం, డిసెంబర్ 28: దాడి చేసి అన్నదమ్ములను తీవ్రంగా గాయపరిచిన ఘటనపై రఘునాథపాలెం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్సై మాచినేని రవి కథనం ప్రకారం.. గణేశ్వరం గ్రామానికి చెందిన మాళోతు కేళీ అనే మహిళ ఎండిన పత్తి కట్టెను గెట్టుమీద వేసి మంట పెడుతుండగా పక్కన చేనుకు చెందిన అన్నదమ్ములైన భుక్యా స్వామి, భుక్యా దోని తమ మొక్కజొన్నకు పంటకు సెగ తగిలి వాడిపోతుందని అన్నారు.
దీనిపై ఆగ్రహించిన కేళీ వారిని అసభ్యకరంగా దూషిస్తూ కేకలు పెడుతుండగా గమనించిన ఆమె భర్త కృష్ణ, కుమారులు నరేశ్, హుస్సేన్లు అక్కడకు వచ్చి అన్నదమ్ములపై దాడి చేశారు. అంతేగాక తీవ్రమైన గాయాలతో వెళ్తున్న అన్నదమ్ములను మార్గమధ్యలో మళ్లీ అడ్డుకొని మాళోతు సుమాన్, హుస్సేన్, నరేశ్లతో కలిసి తిరిగి దాడికి పాల్పడ్డారు. దీనిపై తమపైన దాడి చేశారని మాళోతు నరేశ్ కౌంటర్ ఫిర్యాదు చేశాడు. దీనిపై ఇరువురి ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.