ఖమ్మం, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు.
ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పువ్వాడ అజయ్కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య, పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కం దాళ ఉపేందర్రెడ్డి, మధిర ఎమ్మెల్యే అభ్యర్థిగా లింగాల కమల్రాజు, వైరా ఎమ్మెల్యే అభ్యర్థిగా బానోత్ మదన్లాల్, పినపాక ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరా వు, ఇల్లెందు ఎమ్మెల్యే అభ్యర్థిగా హరిప్రియ, అశ్వారావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావు బీ ఫా లు అందుకున్నారు.
దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నిండింది.ఇక బీఆర్ఎస్ నాయకులు కదన రంగంలోకి దూకనున్నారు.. తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్లనున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ సాధనపై పార్టీ అధినేత కేసీఆర్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, అన్ని పార్టీ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్పై ప్రజల్లో పూర్తి సానుకూల వాతావరణం ఉందని, ఆ సానుకూలతను ఓట్లుగా మలచుకోవాలని సూచించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలన్నారు. నాయకులు, కార్యకర్తలతో సమష్టిగా పనిచేయాలన్నారు. అభ్యర్థులు న్యాయ నిపుణులను సంప్రదించి పకడ్బందీగా నామినేషన్ పత్రాలను సమర్పించాలన్నారు.