ఖమ్మం, మార్చి 6: బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఖమ్మం రానున్నారు. పార్టీ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు మామిళ్లగూడెంలోని వీవీసీ ఫంక్షన్ హాలులో జరిగే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు.
సాయంత్రం 4.30 గంటలకు ఖమ్మం బైపాస్ రోడ్లోని గాయత్రి గ్రాండ్లో జరిగే రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభినందన-కృతజ్ఞత సభలో, స్థానికంగా జరిగే వివిధ కార్యక్రమాల్లో నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొంటారు. ఎంపీ నామా క్యాంప్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది.