హైదరాబాద్లో శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి అజయ్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. హాజరైన వారిలో సత్తుపల్లి, పాలేరు, వైరా, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు ఉన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కూడా మండలి సమావేశానికి హాజరయ్యారు. తొలుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర మర్యాదపూర్వకంగా కలిశారు.