వైరాటౌన్, నవంబర్ 5: నా బలం ప్రజలే, నా ధైర్యం ప్రజలే, నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజలతోనే ఉంటా.. ప్రజల మధ్యనే తిరుగుతా.. అని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్ అన్నారు. ఆదివారం వైరా మున్సిపాలిటీ పరిధిలో 1, 2, 3, 4, 20వ వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 20వ వార్డులో పట్టణ మహిళా అధ్యక్షురాలు బానోత్ సక్కుబాయి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మహిళలు మదన్లాల్కు స్వాగతం పలికి హారతిచ్చి నుదిటి తిలకం దిద్దారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. చర్చీల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. 1వ వార్డులో ఎమ్మెల్యే రాములునాయక్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం పలుచోట్ల మదన్లాల్ మాట్లాడుతూ వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను దీవించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రాణం ఉన్నంతవరకు ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తూ అభివృద్ధి ఆకాంక్షగా పనిచేస్తానని తెలిపారు.
60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రాష్ర్టానికి చేసిందేమి లేదని, ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరుతో అసలు గ్యారంటీ లేనివిధంగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే అభివృద్ధి అని ప్రజలు ప్రతినోటా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి నన్ను ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంంబూరి కనకదుర్గ, మున్సిపాల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, దిశా కమిటీ సభ్యుడు కట్టా కృష్ణార్జున్రావు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి మోహన్రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, వనమా చిన్ని, మేదరమెట్ల శ్రీనివాసరావు, మాదినేని రాంనారాయణ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు లాల్మహ్మద్, కౌన్సిలర్లు మరికంటి డేడికుమారి, ఏదునూరు పద్మజ, మాదినేని సునీత, దారెల్లి పవిత్రకుమారి, డాక్టర్ దారెల్లి కోటయ్య, మాజీ వైస్ ఎంపీపీ తన్నీరు జ్యోతి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి తదితరులు పాల్గొన్నారు.
వైరా మున్సిపాలిటీ పరిధిలో 35మంది హమాలి కార్మికులు కుటుంబాలు మడుపల్లి గిరి ఆధ్వర్యంలో ఆదివారం బానోత్ మదన్లాల్ సమక్షంలో బీఆర్ఎస్ చేరారు. వారికి మదన్లాల్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నా రు. పార్టీలో చేరిన వారిలో మడుపల్లి వెంకటేశ్వర్లు, మడుపల్లి నర్సింహారావు, శివరాంపురం కృష్ణ, అక్కిశెట్టి కృష్ణారావు, ఇమ్మడి సైదులు, లింగయ్య, శివరంగయ్య, అక్బర్, రామ్మూర్తి, రామకృష్ణ, నాగిలిగొండ లింగయ్య, కే శ్రీను, తాటిపూడి భద్రం, జే శ్రీను, జీవరత్నం, ఎం సైదులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.