తిరుమలాయపాలెం, జూన్.19 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వారు నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నేతలు, దళిత సంఘాల నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సీఎం వ్యాఖ్యలను ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోలేపొంగు వెంకటేశ్వర్లు, షేక్ చందు, గంట కృష్ణ, గుగ్గిళ్ల అశోక్ పాల్గొన్నారు.