చుంచుపల్లి, ఏప్రిల్ 2: కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, వారి సంక్షేమమే పార్టీ అధిష్ఠానం ధ్యేయమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. రుద్రంపూర్ పంచాయతీలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం అభివృద్ధిపై ఎలాంటి సవాలుకైనా సిద్ధమన్నారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా కొత్తగూడెం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించానన్నారు. రూ.కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందిందన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మున్ముందు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమన్నారు. తాను సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నానన్నారు. ఎన్నో ప్రజాసమస్యలకు పరిష్కారం చూపానన్నారు. అభివృద్ధిలో నియోజకవర్గం దూసుకుపోతున్నదన్నారు.
సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కం చర్ల చంద్రశేఖర్రావు, ఎంపీపీ బదావత్ శాంతి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఉమర్, ఏఎంసీ చైర్మన్ రాంబాబు, సొసైటీ చైర్మన్ మండె వీరహన్మంతరా వు, ఉర్దూఘర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, ఎంపీటీసీలు ఇళ్ల పరమేశ్, అచ్చా నాగమణి, మక్కడ్, భూక్యా రుక్మిణి, సర్పంచ్లు పొడియం సుజాత, రాందాస్, కళావతి, మోతి, జగదాంబ, మంజుల, కళావతి, నాయకులు వనమా రాఘవ, కాసుల వెంకట్, ఎంఏ రజాక్, షాహినా, రవి, సంతోష్, శ్రీను, వెంకటేశ్, పరంజ్యోతిరావు, అనుదీప్, కరుణాకర్, సాగర్, ప్రవీణ్, ఉపసర్పంచ్లు పాల్గొన్నారు.