పల్లె.. పట్టణం అన్న తేడా లేకుండా ఆదివారం భక్తజనం ఆషాఢ బోనమెత్తారు.. పిల్లాపాపలతో గ్రామదేవతల చెంతకు కదిలారు.. అగరబత్తుల పరిమళాలు.. గంధపు సుగంధాలు.. శివసత్తుల విన్యాసాలు.. డప్పు చప్పుళ్లు.. మహిళా భక్తుల పూనకాల మధ్య అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. వాడవాడలా శోభాయాత్ర నిర్వహించారు. వానలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని మొక్కులు తీర్చుకున్నారు.. ఆయా పూజా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.
– నెట్వర్క్
పట్టణాలు, పల్లెలకు ఆషాఢం పండుగ తీసుకొచ్చింది.. భక్తి పరిమళాలు అద్దింది.. శివసత్తుల పూనకాలు.. లయబద్ధంగా డప్పుల మోతలు ఊరూరా హోరెత్తాయి.. మహిళా భక్తులు, ఆడపిల్లలు బోనమెత్తి గ్రామదేవతల చెంతకు వెళ్లారు.. అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.. పిల్లాపాపాలను చల్లగా చూడాలని మొక్కులు తీర్చుకున్నారు.. – నెట్వర్క్