బోనకల్లు, అక్టోబర్ 27: టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ఎమ్మెల్యేలను రూ.100 కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించడాన్ని ఖండిస్తూ ప్రధాని దిష్టిబొమ్మను పార్టీ ఆధ్వర్యంలో గురువారం బోనకల్లులో దహనం చేశారు. మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ను లేకుండా చేసేందుకు మోదీ కుట్రలు పన్నుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసేందుకు ప్రయత్నిస్తున్న మోదీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రైతుసంఘం మండల అధ్యక్షుడు కాకాని శ్రీనివాసరావు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి యనిగండ్ల మురళీ, ఉపాధ్యక్షుడు ఇటికాల శ్రీనివాసరావు, నాయకులు బంధం శ్రీనివాసరావు, గద్దల వెంకటేశ్వర్లు, తమ్మారపు వెంకటేశ్వర్లు, ఇరుగు నాగభూషణం, షేక్ సైదా, పిల్లెం దేవేందర్, రాజారావు, సైదా, బోనకల్లు సర్పంచ్ సైదానాయక్, హనుమంతరావు, హుస్సేన్, జానీ, వజ్రాల సత్యనారాయణ, ప్రసాద్ పాల్గొన్నారు.
చింతకాని, అక్టోబర్ 27: బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని, ప్రధాని మోదీ తెలంగాణ జాతికి భేషరతు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అన్నారు. చింతకానిలో మోదీ, బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, సొసైటీ చైర్మన్ కొండపల్లి శేఖర్రెడ్డి, నాయకులు గడ్డం శ్రీనివాసరావు, బోడ్డు వెంకట్రామయ్య, చాట్ల సురేశ్, తుడుం రాజేశ్, చాట్ల భగవాన్, వేముల నర్సయ్య, పిన్నెల్లి శ్రీను, పాపినేని రంగారావు, ఆదినారాయణ, కొండలు, పాల్గొన్నారు.
ముదిగొండ అక్టోబర్ 27: ఎమ్మెల్యేల కొనుగోలు యత్నానికి నిరసనగా స్థానిక బస్టాండ్ సెంటర్లో పార్టీ నాయకులు మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ బీజేపి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తందన్నారు. కార్యక్రమంలో నాయకులు బత్తుల వీరారెడ్డి, యర్ర వెంకన్న, తోట ధర్మారావు, పసుపులేటి వెంకటి, అనంతరాములు పాల్గొన్నారు.
మధిరటౌన్, అక్టోబర్ 27: టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కొనుగోలు చేయాలని చేసిన ప్రయత్నాలను టీఆర్ఎస్ నాయకులు ఖండిస్తూ గురువారం పట్టణంలోని అంబేద్కర్సెంటర్లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి నీచమైన రాజకీయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు సహించబోరని, ఇలాంటి వాటిని తిప్పికొడతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాపాడారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మధిర సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, మధిర పట్టణ అధ్యక్షుడు పల్లపోతుల వెంకటేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, రైతుబంధు మండల కన్వీనర్ చావా వేణు, మధిర ఏఎంసీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, నాయకులు బోయపాటి వెంకటేశ్వరరావు, బీ శ్రీనివాసరావు, తాళ్లూరి హరీశ్బాబు, పిడికిటి సాంబ, ముత్తవరపు ప్యారీ, కొఠారి రాఘవరావు, జేవీ రెడ్డి, గద్దల రాజా, ఆళ్ల నాగబాబు, పుల్లారెడ్డి, కపిలవాయి జగన్మోహన్రావు, గద్దల సావ్మి, ఆవుల రాము, జగన్నాధచారి, అంగడాల గోపి, హరి కిరణ్కాంత్, ఖాదర్, గద్దల శేషయ్య, ఏసు, దేవదానం పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, అక్టోబర్ 27: టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కొనుగోలు చేయాలని చేసిన ప్రయత్నాలను టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇలాంటి నీచమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించబోరని, ఇలాంటి వాటిని తిప్పికొడతారని హెచ్చరించారు. ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, వైస్ఎంపీపీ సోరనేని రామకోటేశ్వరరావు, రేమిడిచర్ల, కండ్రిక సర్పంచులు పురుషోత్తంరాజు, రాము, ఎంపీటీసీలు షేక్ మస్తాన్వలి, సంక్రాంతి కృష్ణారావు, సగ్గుర్తి కిషోర్బాబు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు పంబి సాంబశివరావు, కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, నాయకులు చావా రామకృష్ణ, కొండపాటి సాంబశివరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వేమిరెడ్డి బాలరాఘవరెడ్డి, వైస్సర్పంచ్ శ్రీనివాసరాజు, కోఆప్షన్ సభ్యులు షేక్ బాబుషా, నాయకులు దేవరకొండ రవి, మగినం పాల్రాజు, కామిశెట్టి పవన్కుమార్, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, చెన్నంరాము, షేక్ ఇమాంసా, దొరబాబు, బాజీ, లక్కిరెడ్డి శేఖర్రెడ్డి, బొర్రా నారాయణ, నండ్రు రవి, సుబ్బయ్య, నాగయ్య, మోహన్బాబు, పోతయ్య, దానయ్య, ప్రవీణ్, కృష్ణ, ప్రకాశ్, సగ్గుర్తి ప్రభాకర్రావు, వజ్రగిరి ప్రభాకరరావు పాల్గొన్నారు.
నేలకొండపల్లి, అక్టోబర్ 27: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు విషయంలో బీజేపీ వైఖరిని నిరసిస్తూ పట్టణంలోని ప్రధాన సెంటర్లో పార్టీ నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీపీ రమ్య, పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సీడీసీ చైర్మన్ లీలాప్రసాదు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సతీశ్, ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మి, నాయకులు వాజిద్, రవి, వజ్జా శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, రంగయ్య, వంగవేటి నాగేశ్వరరావు, రాయపూడి శ్రీనివాసరావు, బాజా నాగేశ్వరరావు, కే నాగేశ్వరరావు, సత్యనారాయణ, కనకప్రసాద్, శ్రీనివాస్సింగ్, నాగరాజు పాల్గొన్నారు.