భద్రాచలం, ఫిబ్రవరి 12 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అన్ని పూజలు, దర్శనాలకు కంప్యూటర్ ద్వారా టికెట్లు(ఈ-టికెట్) ఇచ్చే ప్రక్రియకు సోమవారం నుంచి శ్రీకారం చుట్టారు.
ఈ విధానాన్ని దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ప్రారంభించారు. ఇదివరకు పేపర్పై ముద్రించిన టికెట్లను కౌంటర్ల ద్వారా భక్తులకు అందించేవారు. ఇక నుంచి అంతా పారదర్శకంగా జరిగేందుకు ఈ విధానాన్ని చేపట్టారు.