భద్రాచలం, జనవరి 3 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీలను బుధవారం లెక్కించగా రూ.1.51 కోట్లు వచ్చాయని దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి తెలిపారు. అదేవిధంగా 92 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి, 352 అమెరికన్ డాలర్లు, రూ.1.10 లక్షల ఇండోనేషియా రూపాయలు, 100 ఖతర్ రియాల్స్, 125 అరబ్ ఎమిరెట్స్ థీరమ్స్, 200 ఒమన్ బైస, 10 నేపాల్ రూపాయలు, 10 యూకే యూరోలు, 20 థాయ్లాండ్ బాత్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 13 నుంచి జనవరి 2వరకు ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు జరగడంతో ఈ ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు.