భద్రాచలం, మార్చి 3: హైదరాబాద్లోని సీఎం నివాసంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా కలిశారు.
భద్రాచలంలోని రామాలయ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని, కరకట్ట పనులను వేగవంతంగా చేపట్టాలని, ములుగు జిల్లా వెంకటాపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని, భద్రాచలం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై సీఎంకు వినతిపత్రం అందజేశారు. సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.