ఖమ్మం : తెలంగాణ సంస్రృతి,సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అక్టోబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీవరకు బతుకమ్మ ఉత్సవాలను ఖమ్మం నగరంలో నిర్వహించాలని టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తన్నీరు శోభారాణి పిలుపినిచ్చారు. గురువారం నగరంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు…నగరంలోని తెలంగాణ భవన్లో 9 రోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వసంతలక్ష్మి దంపతులు ఈ ఉత్సవాలకు హాజరవుతారని అన్నారు. ఈ సమావేశానికి పార్టీ నగర అద్యక్షులు పగడాల నాగరాజు , సుడా డైరెక్టర్లు కొల్లు పద్మ , కీసర పద్మజా రెడ్డి, మహిళా విభాగం సెక్రటరీ రాపోలు విజయలక్ష్మి, ట్రెజరర్ కోడెం తార, ఉపాద్యక్షులు కొలనుపాక రమాదేవి, యలనాటి స్వరూప,త్రీటౌన్ మహిళా ఇన్ఛార్జి చంద్రిక, ఉప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు.