పెనుబల్లి : సాంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం మారిందని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బతుకమ్మ పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించే బతుకమ్మ చీరెలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతుల మీదుగా పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయంలో శనివారం మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కుల,మతాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని, పేద ప్రజల కష్ట-సుఖాలు తెలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ రమాదేవి, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, జడ్పీటీసీల జిల్లా ఫోరం కన్వీనర్ చెక్కిలాల మోహన్రావు, ఏఎంసీ ఛైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్రావు, సీడీసీ ఛైర్మన్ ముక్కర భూపాల్ రెడ్డి, సర్పంచ్లు తేజావత్ తావూనాయక్, భూక్యా పంతులి, మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, ఎంపీటీసీలు చీపు లక్ష్మీకాంతం, వంగా ఝాన్సీ, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మందడపు అశోక్కుమార్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కనగాల సురేష్బాబు, నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.