తల్లాడ :నిరుపేదలకు సైతం ఆర్థిక భరోసా కల్పించి అన్ని విధాలా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తున్నారని అంబేద్కర్ నగర్ సర్పంచ్ జె. కిరణ్ బాబు అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజాసంక్షేమ పథకాలను ఆయన అమలు చేస్తున్నారని అన్నారు. శనివారం అంబేద్కర్ నగర్ గ్రామంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సామాజిక న్యాయం అందుతుందని స్పష్టం చేశారు. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ స్వర్ణ శ్రీలక్ష్మి, వీఆర్ఓ నరసింహారావు, వార్డు మెంబర్లు కమలకుమారి,జోగరావు, రమణ, సౌరి, ఏఎన్ఎమ్ అరునిమా,ఆశా కార్యకర్త సునీత, అంగన్ వాడీ టీచర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.