కారేపల్లి, నవంబర్ 14: సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్లాల్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అందుకని ఈ ఎన్నికల్లో కూడా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కారేపల్లి మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన.. ఉసిరికాయలపల్లి, సీతారాంపురం, చిన్నమడెంపల్లి, గాదెపాడు, మాణిక్యారం, ఎర్రబోడు, కొమ్ముగూడెం, కోమట్లగూడెం, గిద్దెవారిగూడెం, వెంకిట్యాతండా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగకు గంగిరెద్దుల్లా ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చిపోయే నాయకులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్న తనను ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు కారేపల్లి ఎన్నికల కార్యాలయంలో బీఆర్ఎస్ యువజన నాయకుడు గంగరబోయిన మురళి ఆధ్వర్యంలో పొంగులేటి యూత్కు చెందిన 50 మంది యువకులు, ఉసిరికాయలపల్లిలో స్థానిక ఎంపీటీసీ మూడు జ్యోతిమోహన్, బీఆర్ఎస్ నాయకులు జాలా సాంబ, వెంకట్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 40 కుటుంబాల వారు మదన్లాల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మాలోత్ శకుంతల, వాంకుడోత్ జగన్, రావూరి శ్రీనివాసరావు, పెద్దబోయిన ఉమాశంకర్, వీరేందర్, సత్యనారాయణ, హన్మకొండ రమేశ్, ఐలయ్య, గౌసుద్దీన్, మంగీలాల్, అడప పుల్లారావు, బత్తుల శ్రీనివాసరావు, మాలోత్ కిశోర్, బానోత్ కుమార్, బానోత్ మారూ, ఆదినారాయణ, అజ్మీరా నాగేశ్వరరావు, ఎండీ హనీఫ్, వెంకటేశ్వర్లు, రవీందర్రెడ్డి, నాగేశ్వరరావు, ప్రభాకర్, మత్రు, సురేశ్, చందూనాయక్, మురళి, రాము, కోటి, కల్యాణ్ పాల్గొన్నారు.