ఖమ్మం : రుణాలు పొందిన లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని సకాలంలో రుణాలు చెల్లించాలని ఖమ్మం డీసీసీబీ సీఈఓ ఏ.వీరబాబు తెలిపారు. బుధవారం నగరంలోని పెవిలీయన్ గ్రౌండ్ లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణవిస్తరణ కార్యక్రమాన్నిఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా బ్యాంకులకు చెందిన ప్రతినిధులు ముద్రయోజన, స్టాండప్ ఇండియా, అగ్రీ ఇన్స్ట్రా, ఎంఎంఈ, గృహ, విద్య తదితర పథకాలకు సంబంధించిన రుణ మంజూరి పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతికి చెందిన చిరు వ్యాపారుల నుంచి అనేక రంగాల వారికి ఈ రుణమేళ ఎంతగానో ఉపయోగపడిందన్నారు.
డీసీసీబీ సీఈఓ మాట్లాడుతూ తమ బ్యాంకు పరిధిలోని ఖమ్మం రూరల్, ఏన్కూర్, రోటరీనగర్, ఎన్ఎస్టీరోడ్, ఏబీ మార్గులకు చెందిన బ్రాంచీల ద్వారా రూ 1.87 కోట్ల రుణాలకు సంబంధించి మంజూరి పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, ఎస్బీఐ డీజీఎం బంగారు రాజు, పార్థసారధి, డీసీసీబీ ఏజీఎం ప్రవీణ్కుమార్, మేనేజర్లు రామస్వామి, రామకృష్ణ, ఉపేంద్రనాథ్ తో పాటు ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.