ఖమ్మం: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా బ్యాంకుల ఉద్యోగుల సమాఖ్య అధ్యక్ష్య, కార్యదర్శులు నాగేందర్, రాజేష్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ రెండు రోజుల పాటు తమ సమఖ్య పరిధిలోని ఏడు సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునివ్వడం జరిగందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల పాటు కొనసాగే సమ్మెకు ఉద్యోగులు మద్దతు ఇవ్వాలని, వినియోగదారులు, ఖాతాదారులు సహకరించాలని కోరారు.
బ్యాంకుల ప్రైవేటీకరణ జరిగితే ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా, ఎస్సీ,ఎస్టీ, బీసీతో పాటు మాజీ సైనికులకు సంబంధించిన రిజర్వేషన్లు కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం బడ్డెట్ సమావేశాల్లో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, జీవిత బీమా సంస్థను సైతం ప్రైవేటీకరణ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని బ్యాంకు ఉద్యోగసంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగందన్నారు.