భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా ఎన్.బలరాంనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటివరకు డైరెక్టర్(పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్)గా పనిచేస్తున్న ఆయన సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు.
గతంలో సింగరేణి సీఎండీగా పనిచేసిన ఎన్.శ్రీధర్ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు బదిలీ చేశారు. దీంతో సీఎండీ పోస్టు ఖాళీ అయింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బలరాం అదనపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. బాధ్యతలు తీసుకున్న ఎన్.బలరాం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని, సీఎస్ శాంతికుమారిని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.