ఆళ్లపల్లి:అనారోగ్యంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలకేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఆళ్లపల్లిమండలపరిధి లోని రాయిపాడు గ్రామానికి చెందిన పెండకట్ల సాయికిరణ్(18) గత రెండు రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ ఇంటి వద్దనే చికిత్స పోందుతున్నాడు.ఆదివారం మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.