కొత్తగూడెం: జిల్లాలోని చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో ఉన్న ఎస్ఆర్టీ ఏరియా బాధితులకు అండగా ఉంటామని, వారిని అక్కడి నుంచి తొలగించవద్దని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు అన్నారు. మంగళవారం ఎస్ఆర్టీ ఏరియాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో ఆయన మాట్లాడారు. సింగరేణి అధికారులు ప్రత్యామ్నాయం చూపించకుండా వారిని తరలించవద్దని, సింగరేణి అధికారులు ఆలోచించాలని అన్నారు. ఫోన్లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బాధితులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ఎవరూ ఆందోళన చెందవద్దని, మీ వెంట మేము ఉంటామని, అవసరమైతే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాదావత్ శాంతి, ఎంపీటీసీ ఆర్తీ మక్కడ్, సర్పంచ్ గుమ్మడి సాగర్, నాయకులు కాసుల వెంకట్, ఉర్దూఘర్ కమిటీ చైర్మన్ అన్వర్పాషా, టీబీజీకేఎస్ నాయకులు ఎండీ రజాక్, కాపు కృష్ణ, చుంచుపల్లి మండల అధ్యక్షుడు ఉమర్, అజీజ్ఖాన్, మురాద్భాయ్, డైరెక్టర్ నిమ్మల సాగర్, తమ్మిశెట్టి అశోక్, అచ్చా నాగరాజు, యూత్ అధ్యక్షుడు కన్ని, రాసపల్లి ప్రసాద్, యాకయ్య, చెరుకుపల్లి నాగరాజు, గోపు కుమారస్వామి, నటరాజ్, ఫయాజ్, చిరంజీవి, బన్నీ, నాగమణి, అశోక్, చిలుక రాజయ్య, సుధాకర్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.