కొత్తగూడెం, జూలై 02 : ప్రకృతికి విశేష సేవలందించిన పద్మశ్రీ వనజీవి రామయ్య జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్లో నిర్వహించిన “వనజీవి రామయ్య అవార్డు మహోత్సవం”లో బాల పర్యావరణ ప్రేమికుడు, ‘మొక్కల వారసుడు’గా పేరుగాంచిన విశ్వామిత్ర చౌహాన్కు ప్రతిష్ఠాత్మక “వనజీవి రామయ్య స్మారక పురస్కారం” ప్రదానం చేశారు. ‘వనజీవి రామయ్య’ చిత్ర దర్శకుడు వేముగంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 70 ఎకరాల అటవీని సృష్టించిన పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ చేతుల మీదుగా విశ్వామిత్ర చౌహాన్కు పురస్కారం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. పర్యావరణ పరిరక్షణలో చిన్నారి చేస్తున్న విశేష సేవలను ఈ సందర్భంగా నిర్వాహకులు అభినందించారు. ఈ అవార్డును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పర్యావరణవేత్తలు మొక్కల వెంకటయ్య, ‘సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ హరినాథ్ కూడా అందుకున్నారు. అనంతరం వనజీవి రామయ్యకు నివాళిగా హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్ ప్రాంగణంలో విశ్వామిత్ర చౌహాన్ “పింక్ పనస” మొక్కను నాటారు. ప్రకృతిని పరిరక్షించడమే వనజీవి రామయ్యకు నిజమైన నివాళి అని చౌహాన్ పేర్కొన్నాడు.