ములకలపల్లి: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల28న జరిగే విసృతస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని టీఎస్ యూటీఎఫ్ మండల ఉపాధ్యక్షులు బి.రవి పిలుపునిచ్చారు. శుక్రవారం ములకలపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులు వెంటనే నిర్వహించాలని, సీపీఎస్ను రద్దు చేయాలని, పాఠశాలలో ఉపాధ్యాయులు లేనిచోట విద్యావాలంటీర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సమస్యల పరిష్కారం కోసం ఈ నెల28న టీఎస్ యూటీఎఫ్ నిర్వహించే విస్తృతస్థాయి సమావేశానికి ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడా ప్రతినిధి పూనాటి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి తేజావత్ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఎల్.అశోక్, కె.శ్రీరామ జానకీదేవి, హనుమంతరావులు పాల్గొన్నారు.