భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల టిక్కెట్ ధరలను పెంచుతున్నట్లు బుధవారం అధికారులు ప్రకటించారు. సెక్టార్ 1బి ధరలను రూ.5,000 నుంచి రూ.7,500కు పెంచగా, సెక్టార్ 1ఏ టికెట్ ధరలను 2,000 నుంచి రూ.2,500కు పెంచినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శివాజీ తెలిపారు. సెక్టార్ 1సి టిక్కెట్ ధర రూ. 1,116 నుంచి రూ. 2,000కి పెరిగింది.1డి, 1ఇ, 1ఎఫ్ టిక్కెట్ల ధరలను రూ.500 నుంచి రూ.1000కు పెంచగా, 2ఏ, 2బీ, 2సీ, 2డీ, 2ఈ, 3ఏ, 3బీ, 3సీల టిక్కెట్లను రూ.200 నుంచి రూ.300కి పెంచినట్లు ఈఓ తెలిపారు.
అదే విధంగా 4ఏ, 4బీ, 4సీ, 4డీ, 4ఈ, 4ఎఫ్, 4జీల ధరలు రూ.100 నుంచి రూ.150కి పెరిగాయి. అలాగే మహాపట్టాభిషేకంలో పాల్గొనేందుకు రూ.250 టికెట్ ధరను రూ 1,000కి పెంచినట్లు అధికారులు తెలిపారు. భక్తులు రూ. 5వేలు చెల్లించి తపాలా ద్వారా ఐదు ముత్యాల తలంబ్రాలు, పంచె, కండువ, చీర, జాకెట్ పొందవచ్చని, అలాగే నిత్యకల్యాణం జరిగే సమయంలో భక్తుల గోత్ర నామాలతో పూజలు నిర్వహిస్తారు. 1,116 చెల్లించి రెండు ముత్యాలు, కుంకుమ, ప్రసాదం అందించడంతోపాటు వారి గోత్రనామాలతో పూజ చేస్తామని ఆలయ ఈవో తెలిపారు.