భద్రాద్రి: జిల్లాలోని లక్ష్మీనగరం ఎస్బీఐ బ్యాంకులో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి బ్యాంకు తాళాలు పగలగొట్టి, లోపలకు ప్రవేశించారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బ్యాంకులో చోరీ జరిగినట్లు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకులో ఎంత మొత్తం చోరీ జరిగిందీ తెలియాల్సి ఉంది.