రామవరం, సెప్టెంబర్ 05 : అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపంతో సమాజాన్ని సంస్కరించే ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో ఎంత గొప్ప స్థానంలో ఉన్నా వారంతా ఒకప్పుడు ఓనమాలు నేర్చుకున్నది ఉపాధ్యాయుల వద్దనే అన్నారు. కనుక ఎవరు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా ఉపాధ్యాయులను గౌరవించడం మరువరాదన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని కీర్తిస్తూ విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో చేసిన ప్రసంగాలు, నృత్య ప్రదర్శనలు, నాటికలు అలరించాయి. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, టీచర్లు నీలా, లక్ష్మీ ప్రసన్న, నసరత్, సరస్వతీ, సల్మా, విజయ లక్ష్మి, జేఫీషా, ఖాజా, అనితా పాల్గొన్నారు.
Ramavaram : అజ్ఞానాన్ని పారదోలేవాడే గురువు : షేక్ అబ్దుల్ బాసిత్