భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శనివారం సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు అర్చకులు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం, ఆరగింపు, నిత్య బలిహరణం, నిత్య హోమం, నిత్య పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామివారిని వేంచేపు చేసి నిత్యకల్యాణం కనులపండువగా నిర్వహించారు. కల్యాణ దాతలకు స్వామివారి శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేశారు.