చుంచుపల్లి, ఫిబ్రవరి 09 : చుంచుపల్లి మండలంలోని పెనగడప చండ్రుకుంట గ్రామంలో గత 15 సంవత్సరాల క్రితం పాఠశాలను మూసివేశారు. పాఠశాలను మూసివేయడంతో ఆ గ్రామం నుండి సుమారు పది మంది పిల్లలు అదే విధంగా పక్క గ్రామమైన మర్రిగూడెం నుండి 20 మంది విద్యార్థులు పెనగడప హైస్కూల్ కు రోజు వచ్చివెళ్తూ చదువుకుంటున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని చుంచుపల్లి ఎంఈఓ బాలాజీ చండ్రుకుంట పాఠశాలను పునఃప్రారంభించేందుకు సోమవారం పాఠశాలను పరిశీలించారు. మర్రిగూడెం గ్రామాల్లో 30 మంది విద్యార్థులు వెనగడప వెళ్లేందుకు దూర భారం అవుతుండడంతో దృష్టిలో ఉంచుకుని ఈ పాఠశాలను పునఃప్రారంభించేందుకు పై అధికారులకు తెలియజేయనున్నట్లు, అదే విధంగా పాఠశాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు రాములు పాల్గొన్నారు.