చండ్రుగొండ:రైతుబంధు పథకంతో రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు సంబురాల్లో భాగంగా విద్యార్దులకు నిర్వహించిన ముగ్గుల పోటీలు,వ్యాసరచనపోటీలను ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఎంతో మేలు చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి,గానుగపాడు సోసైటి చైర్మన్ చెవుల చందర్రావు, టిఆర్ఎస్ మండల అద్యక్షులు దారా వెంకటేశ్వరరావు(భాబు), ప్రధాన కార్యదర్సి ఉప్పతల ఏడుకొండలు,సర్పంచ్ మలిపెద్ది లక్ష్మిభవాని, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేడా మొహన్రావు, సూర వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు, ప్రధానోపాద్యాయురాలు మంజుశ్రీ, పిడి గంగా ప్రసాద్ ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.