చండ్రుగొండ: మున్నూరుకాపులకు రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరుకాపు సంక్షేమ సంఘం మండల కమిటి డిమాండ్ చేసింది. గురువారం మున్నూరుకాపు సంక్షేమ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఉషాశారదకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ…వ్యవసాయమే ప్రధాన వృత్తిగా మున్నూరుకాపు కులస్తులు జీవిస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయి ఆర్థికంగా చితికిపోయారన్నారు.
వెంటనే ప్రభుత్వం కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ఆర్థికంగా మున్నూరుకాపులు బలోపేతం అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం మండల అద్యక్షులు లంకా నరసింహరావు, పసుపులేటి వెంకటేశ్వర్లు, భూపతి రమేష్, చలవాది రామారావు, అంచ అప్పారావు, రంగిశెట్టి రాము, రామిశెట్టి వెంకటేశ్వర్లు, మక్కా రమేష్, ఆళ్ల శ్రీనివాస్, రామిశెట్టి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.