పాల్వంచ, మార్చి 18 : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రతిరోజు పోషకాహారం అందించాలని కొత్తగూడెం 7వ డివిజన్ కార్పొరేటర్ సింధు తపస్వి అన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు డివిజన్లోని పారిశుధ్య కార్యక్రమాలతో పాటు విద్యుత్ సమస్యలను పరిష్కరించి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా బుధవారం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. వేసవికాలం వచ్చినందున పిల్లలకు కుండల్లో నీళ్లు సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, పిల్లలు, వారి తల్లులు పాల్గొన్నారు.