భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాత పాల్వంచలో ఈనెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి.. ఏఎస్పీ రోహిత్ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
పాత పాల్వంచలో 3న జరిగిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. నాగ రామకృష్ణ, అతడి వైఫ్ శ్రీలక్షి. కూతుళ్లు. సాహితి. సాహిత్య. ఈ నలుగురు చనిపోయారు. ఈనెల 3న ఉదయం రామకృష్ణ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్రోల్ పోసి అంటించడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్ద కూతురు సాహిత్య.. 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో జాయిన్ అయింది. రామకృష్ణ బావమరిది జనార్ధన్ రావు ఫిర్యాదు ఆధారంగా పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశాం. సాహిత్య కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో 5 రోజుల తర్వాత చనిపోయింది. అక్కడ దొరికిన సెల్ఫీ వీడియోలు, సూసైడ్ నోట్ ద్వారా వనమా రాఘవ, తన తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు సూసైడ్ నోట్లో రాసి రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.
వనమా రాఘవేంద్ర అనే వ్యక్తి డబ్బులే కాకుండా తన భార్యను కూడా ఆశించాడని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. 3న ఫిర్యాదు రాగానే వెంటనే సీన్ ఆఫ్ క్రైమ్కు వెళ్లి అక్కడున్న సాక్ష్యాలను సేకరించి వెంటనే కోర్టుకు సమర్పించాం. వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం. ఏపీ, తెలంగాణలో ప్రత్యేక బృందాలు వెతుకులాట ప్రారంభించాయి. దీంతో దమ్మపేట మండలంలో మందలపల్లి క్రాస్ రోడ్ వద్ద వారిని కస్టడీలోకి తీసుకున్నాం.
వారిని ఎస్పీ ఆఫీసులో ప్రొడ్యూస్ చేశాం. వనమా రాఘవతో పాటు గిరీశ్, మురళి అనే వ్యక్తులను కూడా కస్టడీలోకి తీసుకున్నాం. వనమా రాఘవేంద్రకు చావా శ్రీనివాస్, రమాకాంత్.. అనే మరో ఇద్దరు పారిపోయేందుకు సహకరించారు. వారిపై కూడా 212 సెక్షన్ ప్రకారం కేసు ఫైల్ చేశాం.
అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఇవాళ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతాం. ఈ కేసుతో పాటు మరో 12 కేసులు వనమ రాఘవ మీద ఉన్నాయని ఏఎస్పీ రోహిత్ వెల్లడించారు.