చండ్రుగొండ:మండల వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత పదిరోజులుగా వానలు ఆగడంతో వరి కోయించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా వరికోతలు ప్రారంభమవ్వడంతో రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని దళారులు, వరికోత యంత్రాల యజమానులు కోసే కూలీ రేటును విపరీతంగా పెంచారు. గత ఏడాది వరికోత మిషన్లు గంట సమయం కోయటానికి రూ.1500లు తీసుకుంటే, ఈ ఏడాది ప్రస్తుతం రూ.2500లకు పెంచారు.
చైన్(ట్రాక్) మిషన్ గతంలో రూ.2500లు గంటకు తీసుకుంటే ప్రస్తుతం రూ.3500లు వసూలు చేస్తున్నారు. ధరల పెరుగుదలలో దళారులదే పెద్దన్నపాత్ర అయింది. వాతావరణంలో వస్తున్న మార్పులకు వానలు కురుస్తాయనే రైతుల భయాన్ని దళారులు, యంత్రాల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు.