కరకగూడెం: మండల పరిధిలోని గొల్లగూడెంలో బుధవారం మహిళలు ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు నిర్వహించారు. డప్పువాయిద్యాలతో అమ్మవారి ఆలయానికి ప్రదర్శనగా వెళ్లి మొక్కులు సమర్పించారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని గ్రామ దేవతలకు బొడ్రాయికి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం ముత్యాలమ్మ తల్లికి పసుపు, కుంకుమలతో చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.