కొత్తగూడెం: ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే మెజారిటీ ఓటర్లు మావైపే ఉన్నారని ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్ది తాతా మధు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎన్నికల ఏజెంట్ నల్లమల వెంకటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అన్ని చోట్ల ఒకే నిబంధనలు ఉండాలి కాని కొత్తగూడెంకు వేరే ఉంటాయా అని ఆర్డీఓ స్వర్ణలతను ప్రశ్నించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెజారిటీ సభ్యులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని గెలుపు తమదే అని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు తమ విజయానికి కారణం అవుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఇల్లందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఎన్నికల ఏజెంట్ నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.