కొత్తగూడెం : జిల్లాలోని ప్రసిద్ది చెందిన కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మగుడిలో ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన వాల్పోస్టర్ ను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో ఆలయ ఈవో, అర్చకుల సమక్షంలో ఆయన చేతుల మీదుగా ఈ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. తొమ్మిది రోజుల పాటు కరోనా నిబంధనలనడుమ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరావు, జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, టీఆర్ఎస్ నాయకులు మహిపతి రామలింగం, చింతా నాగరాజు, గంధం వెగళరావు, ముత్యాల ప్రవీణ్కుమార్, ఆడెపు చినర్న వెంకటరామయ్య, బండి చిన్న వెంకటేశ్వర్లు, సందుపట్ల శ్రీనివాస్రెడ్డి, మాలోత్ సువాలి, కాటారపు లక్ష్మీనారాయణ, కిలారు నాగమల్లేశ్వరరావు, ఎస్వీఆర్కే ఆచార్యులు, బేతంశెట్టి విజయ్కుమార్, ఆలయ ఈవో శ్రీనివాస్, అర్చకులు పాల్గొన్నారు.