అశ్వారావుపేట : చిరుధాన్యాలు ధీర్ఘకాలిక వ్యాధుల నివారణకు దివ్యౌషధం అని జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి అన్నారు. ప్రస్తుతం మూడు పూటలా సన్న బియ్యం తినడంవల్లే ఫైబర్ పూర్తి స్థాయిలో అందక ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారన్నారు. అశ్వారావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు, నీతి అయోగ్, వాసన్ సంస్ద ఆధ్వర్యంలో మండలంలోని తిరుమలకుంట,అల్లిగూడెం గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో వేరువేరుగా చిరుధాన్యాల ఆహార పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా చిరుధాన్యాల ఆహార పద్దారాలు, చిరుధాన్యాలను ప్రదర్శించారు. ఈసందర్భంగా చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను గర్భణీలకు, చిన్నారులకు, బాలింతలకు పంపీణీ చేశారు.
అనంతరం ఎంపీపీ, జడ్పీటీసీలతో కలిసి అంగన్వాడీ కార్యకర్తలు, చిన్నారుల తల్లులు, చిన్నారులు, స్దానిక సంస్దల ప్రజాప్రతినిధులు బతకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో రోజారాణి, సర్పంచ్లు సున్నం సరస్వతి, యాట్ల మహేశ్వరరెడ్డి, ఎంపీటీపీ నారం నాగలక్ష్మి, సూపరవైజర్ విజయలక్ష్మి, చిరుధాన్యాల జిల్లా కోఆర్డినేటర్ బి మోహన్, గ్రామస్తులు జె రాంబాబు, బి చెన్నారావు,జె వెంకన్నబాబు,పీ లక్ష్మణరావు, వార్డు సబ్యులు,అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వాసన్ సంస్ద ప్రతినిధి,సీఆర్పీ ఈశ్వర్ పాల్గొన్నారు.