కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూన్ 18 : ఇన్ఫార్మర్ నెపంతో ముగ్గురిని హతమార్చి 12 మందిని అపహరించిన మావోయిస్టులు బుధవారం వారిని విడుదల చేశారు. లొంగిపోయిన మావోయిస్టు దినేశ్ మడివి బంధువులైన ముగ్గురిని మంగళవారం సాయంత్రం పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేసి, 12 మందిని మావోయిస్టులు అపహరించుకెళ్లిన విషయం విధితమే. ఇదిలా ఉండగా మావోయిస్టులు అపహరించుకు వెళ్లిన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందిన పెదకోర్మ గ్రామస్తులని బుధవారం ఉదయం విడుదల చేసినట్లుగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ అధికారులు ధ్రువపరచాల్సి ఉంది.