జూలూరుపాడు, మార్చి 26 : ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, కాకర్ల గ్రామానికి చెందిన చెంగల గురునాధం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. విషయం తెలిసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గురువారం నేరుగా కాకర్ల గ్రామానికి విచ్చేసి గురునాధంను సందర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మోదుగు ఆదాం, మోదుగు ప్రభాకర్, వేల్పుల నరసింహరావు, మిరియాల ఫ్రాన్సిస్, కిన్నెర దేవయ్య, కొత్తపల్లి సోమయ్య, ఏపూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తగరం వెంకట నరసింహారావు, మండల అధ్యక్షులు దెబ్బెందుల సాయి కుమార్, వేల్పుల భాస్కర్, ఖమ్మం జిల్లా నాయకులు తూరుగంటి అంజయ్య, దేపంగి రమణయ్య, మంద కిశోర్ పాల్గొన్నారు.