బూర్గంపహాడ్, జూన్ 16 : ఇసుక లారీలు రయ్.. రయ్ మంటూ రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని పేర్కొంటూ బూర్గంపహాడ్కు చెందిన రైతులు, ప్రజలు, స్థానికులు సోంపల్లి ర్యాంపు వద్ద లారీలను మంగళవారం అడ్డుకున్నారు. వ్యవసాయ సాగు సమయం కావడంతో రైతులు ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయ పరికరాలు, ఎరువులు, పురుగుమందులు తమ పొలాలకు ఈ దారుల గుండానే వెళ్లాల్సి రావడంతో ఈ దారులను ఎంచుకున్న ఇసుక లారీలు ఇటుగా రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్లన్నీ గుంతలు పడి అధ్వాన్నంగా మారాయని, దీంతో తమ వ్యవసాయ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇసుక ర్యాంపు నిర్వాహకులు దారి మార్చుకుని ఇసుక రవాణా సాగించాలని లేదంటే లారీలను అడ్డుకుంటామని హెచ్చరించారు.